Prabhas Shocking : షాకింగ్ –  గుట్టుచప్పుడు కాకుండా జగన్ పై ప్రభాస్ పోస్ట్.. అందులోనే ఎందుకు?

Prabhas Shocking
Prabhas Shocking : ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏపీలో తీసుకొచ్చిన కొత్త రేట్స్ కోసం గాను మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర ప్రముఖ బిగ్ స్టార్స్ కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు సినిమా శాఖ మంత్రి పేర్ని నాని ని కలిసి తమ సమస్యలు విన్నవించడం తెలిసిందే.
మరి వీరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు కూడా ఉన్నారు. వారు అప్పుడు మాట్లాడ్డం కూడా చాలా కీలకంగా మారింది. సరే ఇదిలా ఉండగా నిన్న చెప్పినట్టు గానే ఏపీ ప్రభుత్వం సరికొత్త టికెట్ ధరలను ఎట్టకేలకు తీసుకొచ్చి జివో ని అందించారు.
దీనితో చాలా మందే టాలీవుడ్ ప్రముఖులు ధన్యవాదాలు తెలుపుతూ వచ్చారు. కానీ ప్రభాస్ కూడా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మరియు మంత్రి పేర్ని నానీలకు ధన్యవాదాలు చెప్తూ పోస్ట్ చేసిన సంగతి చాలా మందికి తెలీదు. ( Prabhas Shocking ) కానీ నిజంగానే ప్రభాస్ జగన్ మరియు నాని లకు ట్యాగ్ చేసి మరీ పోస్ట్ చేసాడు. అయితే ఇది తన ఫేస్ బుక్ ఖాతా నుంచి చేయడం జరిగింది.
అయినా చాలా మందికి ఇది తెలియలేదు. జెనరల్ గా అయితే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ లో ఏదన్నా పోస్ట్ చేయగా అది బాగా వైరల్ అయ్యేది. కానీ కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యకపోవడం అనేది ఆసక్తిగా మారింది. మరి ఇలా గుట్టు చప్పుడు కాకుండా కేవలం ఒక ప్లాట్ ఫామ్ లోనే ప్రభాస్ వేయడం వెనుక ఆంతర్యం ప్రభాస్ కే తెలియాల్సి ఉంది.