Kanthaaravo: కాంతారావును దెబ్బతీసిన సొంత సినిమాలు.. ఏంటో తెలుసా?

Kanthaaravo: తెలుగు చలనచిత్ర చరిత్రలో కాంతారావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు అయితే ఆ కళ్ల మధ్య ఉండే తిలకం లాంటి వాడు కాంతారావు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంతారావు సాంఘీక, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించినా జానపద చిత్ర కథానాయకుడిగా కత్తి కాంతారావు పేరు సాధించారు. అలా ఆయన దాదాపు 450 చిత్రాల్లో నటించి ఔరా అనిపించుకున్నారు. నారదుని పాత్రలో నటించి తనకు సాటి మరెవరూ లేరనిపించుకున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్‌తో పరిచయం కాంతారావుకు ఎంతో మేలు చేసింది. తన సొంత చిత్రాల్లోనే కాకుండా తను నటించే అన్ని చిత్రాల్లోనూ కాంతారావుకు మంచి వేషం ఇప్పించి ఎంతో సాయం చేశారు ఎన్టీఆర్. అప్పటి సినిమాల్లో చూసుకుంటే అగ్రహీరోల తర్వాత ఆయన పేరే వినిపించేది. అరవైల చివరిలో ఆయన జీవితంలో సినిమా కష్టాలు మొదలయ్యాయి. అప్పటికి కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలు కూడా ఇండస్ట్రీకి వచ్చేశారు. జానపదాలకు, పౌరాణికాలకు కూడా ఆదరణ తగ్గింది. ఆ సమయంలో తను కూడా పోటీలో ఉండాలంటే సొంతంగా సినిమా తీయాలనుకున్నారు కాంతారావు. ఆ నిర్ణయమే ఆయన్ని కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు.

1969లో తన భార్య పేరుతో హేమ ఫిలిమ్స్ సంస్థను నెలకొల్పి సప్తస్వరాలు చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కాంతారావు తెలంగాణ వ్యక్తి అన్న ప్రచారంతో ఆంధ్రాలో ఆ సినిమా ఆడలేదు. దాంతో తొలి సినిమాతోనే 6 లక్షల నష్టం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తీసిన గండర గండడు, ప్రేమ జీవులు కూడా అంత ఆదరణకు నోచుకోలేకపోయింది.

ఇకపోతే ఆ తర్వాత రిమేక్ సినిమా అయిన గుండెలు తీసిన మొనగాడు అనే క్రైమ్ చిత్రం తీసినా అనుకున్న సమయానికి పూర్తికాలేకపోయింది. దాంతో బడ్జెట్ పెరిగి దాదాపు 8 లక్షల నష్టం వచ్చింది. దాంతో ఆయన ఇల్లు అమ్మేసి వీధిన పడ్డారు కాంతారావు. 1989లో తీసిన స్వాతిచినుకులు చిత్రంతో కాంతారావు కొంచెం ఆర్థికంగా కోలుకుంటారని అనుకున్నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. దాంతో వాణిశ్రీ భర్త కరుణాకరన్‌కు సినిమా హక్కులు రాసిసిచ్చేసి ఒట్టి చేతులతో హైదరాబాద్ చేరుకున్నారు కాంతారావు.