Neha Shetty: ఆ స్టార్ హీరో సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను అంటున్న నేహా శెట్టి..?

Neha Shetty: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి నటించిన తాజా చిత్రం డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఈనెల 12వ తేదీ థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చునర్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మించింది. ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఒక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు నటి కావాలి అన్న కోరిక ఉండేది అని తెలిపింది. ఎక్కువగా హృతిక్ రోషన్ సినిమాలు డాన్సులు చూసి సినిమా ఇండస్ట్రీ పై ఇష్టాన్ని పెంచుకున్నాను అని ఆమె తెలిపింది. ఇక చదువు పూర్తయిన తర్వాత ఆమె మోడలింగ్ చేసిందట. ఆ తర్వాత మలయాళంలో ముంగారుమలై 2 సినిమాలో నటించిన తర్వాత, దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి తనకు పిలుపు వచ్చింది అని ఆమె తెలిపింది. అనంతరం యూఎస్ వెళ్లి అక్కడ న్యూ ఇయర్ ఫిలిం అకాడమీలో నటన నేర్చుకుందట. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి రౌడీ,మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ సినిమాల్లో నటించింది.

ఇక ప్రస్తుతం ఆమె నటించిన డీజే టిల్లు సినిమా కోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని ఆమె తెలిపింది. డీజే టిల్లు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని నమ్ముతున్నాను అని ఆమె తెలిపింది. ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణాలు కూడా లేకపోలేదు.. ఎందుకంటే ఈ సినిమా ఒప్పుకోవడానికి మంచి స్క్రిప్ట్ ఉంది, అలాగే హీరో సిద్ధూ, దర్శకుడు విమల్ సినిమాను ఫన్ గా డిజైన్ చేశారు అని ఆమె తెలిపింది. ఇవన్నీ కలసి ఒక మంచి ప్రాజెక్టులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను.. అందుకే ఈ సినిమా ఓకే చెప్పాను అని తెలిపింది.