Balakrishna: ఎంతోమంది రాజకీయాలలోకి వచ్చారు… అడ్రస్ లేకుండా పోయారు..  బాలయ్య  పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్!

Balakrishna: సినీ నటుడు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ రాజకీయాలలో కూడా ఓటమి ఎరుగని నాయకుడిగా దూసుకుపోతున్నారు. గత మూడుసార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బాలయ్య ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ విజయం సాధించారు.

ఈ విధంగా బాలయ్య రాజకీయాల పరంగాను ఇటు సినిమాల పరంగా మంచి సక్సెస్ అందుకోవడం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ గారి పేరు ప్రతిష్టలను కూడా నిలబెడుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక బాలయ్య సినిమా ఇండస్ట్రీకి అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న నేపథ్యంలో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇటీవల ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకు సినిమా ఇండస్ట్రీ కూడా ఘనంగా సత్కరించింది అయితే తాజాగా బాలకృష్ణకు మరోసారి పౌర సన్మాన సభని నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వివాదాలకు దారి తీశాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ అయిన వారంతా కూడా రాజకీయాలలో కూడా సక్సెస్ అవ్వాలని లేదు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి వచ్చి అడ్రస్ లేకుండా పోయారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కనుక నన్ను ప్రజలు గెలిపించారు కానీ రామారావు కొడుకుని అన్న కారణంతో నన్ను గెలిపించలేదు అంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ ఈ వ్యాఖ్యలను చిరంజీవిని ఉద్దేశించే మాట్లాడాలని మండిపడుతున్నారు చిరంజీవి సైతం ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నప్పటికీ రాజకీయాలలోకి వచ్చే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. కానీ చిరు రాజకీయాల పరంగా సక్సెస్ అందుకోలేకపోవడంతో తిరిగే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లిపోయారు. దీంతో కచ్చితంగా బాలకృష్ణ ఈ వ్యాఖ్యలను చిరంజీవిని ఉద్దేశించి చేశారు అంటూ మెగా అభిమానులు బాలయ్య తీరుపై మండిపడుతున్నారు.