సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ గెలికిన నాగబాబు!!

Naga babu Satires On Trolls About Bomma Adhirindi Skits

మెగా బ్రదర్ నాగబాబుకు వైఎస్ జగన్ అభిమానులకు మధ్య నడుస్తున్న సోషల్ వార్ గురించి అందరికీ తెలిసిందే. మొన్న ఆదివారం నాడు ప్రారంభమైన బొమ్మ అదిరింది షో ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ షోలో గల్లీబాయ్స్ టీం నుంచి రియాజ్ అనే వ్యక్తి వైఎస్ జగన్‌లా నటించడం, ఆయన మ్యానరిజాన్ని అనుకరిస్తూ కించపరిచేలా స్కిట్ చేశాడు. ఇక సద్దాం అనే వ్యక్తి చంద్రబాబు, బాలయ్యలా నటించి ఫన్ క్రియేట్ చేశారు. అయితే వీటిలో జగన్ ఫ్యాన్స్ మాత్రం కాస్త పర్సనల్‌గా తీసుకున్నారు.

Naga babu Satires On Trolls About Bomma Adhirindi Skits
Naga babu Satires On Trolls About Bomma Adhirindi Skits

వైఎస్ జగన్‌లా రియాజ్ నటిస్తున్నప్పుడు నాగబాబు పడి పడి నవ్వాడు. అయితే ఈ షోను జగన్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. షో నిర్వాహకులు, కంటెస్టెంట్లు, నాగబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో రియాజ్, హరి, సద్దాం వంటి ఆర్టిస్ట్‌లు దిగొచ్చి.. క్షమాపణలు చెప్పారు. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని, ఈ ఒక్కసారికి వదిలేయండి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడతామని వీడియోలు వదిలారు.

Naga babu Satires On Trolls About Bomma Adhirindi Skits
Naga babu Satires On Trolls About Bomma Adhirindi Skits

అయితే ప్రస్తుతం ఇది నాగబాబు వర్సెస్ జగన్ ఫ్యాన్స్‌ వార్‌లా మారింది. నాగబాబుపై సోషల్ మీడియాలో విపరీతంగా మండిపడుతున్నారు. వీటన్నంటికి నాగబాబు కూల్‌గా సెటైర్లు వేస్తున్నాడు. సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టిన ఫోటోను, ఒక్క వెంట్రుక కూడా పీకలేరు అంటూ మరో పోస్ట్ పెట్టారు. తాజాగా మరో పోస్ట్ పెట్టి మళ్లీ గెలికాడు. ఎక్కడో విన్నాను అంటూ సింహం సింగిల్‌గా వస్తుంది..గొర్రెలు గుంపులుగా వస్తాయి అని అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు.