కేసీఆర్ కాలి గోటికి కూడా ఈటెల సరిపోడు: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బీజేపీ నాయకుల పై విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య జోరు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటీవలే కేసీఆర్ ను గద్దె దించుతామని పలువురు బీజేపీ నేతలు కూడా అన్నారు. అంతేకాకుండా బీజేపీ నేత ఈటెల రాజేందర్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానని కూడా అన్నారు.

దీంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తిరిగి ఈటలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈటెల కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడని అన్నారు. అంతేకాకుండా హుజూరాబాద్ లో ఆయనకు ఓటమి భయం పట్టుకుంది అని.. ముఖ్యంగా కేసీఆర్ పై గెలుస్తానని మాటలు పక్కన పెట్టాలి అని అన్నారు. ఇక సొంత నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. హుజురాబాద్ అభివృద్ధిపై చర్యకు సిద్ధమా అని ఛాలెంజ్ కూడా చేశారు.