చంద్రబాబుకు రోజా దిమ్మ‌తిరిగే సవాల్..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని వికేంద్రీకరణ విషయంలో అధికార వైసీపీ, ప్ర‌తిపక్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే సవాల్ విసిరారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర పొందిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు మాత్రం అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాలని, అదే రాష్ట్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు చేశారు.

ఇక ఈ క్ర‌మంలో అదే నిజ‌మైతే చంద్ర‌బాబు త‌న‌కు ఉన్న 20మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల‌ని, అప్పుడే రాష్ట్ర ప్ర‌జ‌లు, ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కోరుకుంటున్నార‌ని తాము అంగీక‌రిస్తామ‌ని రోజా అన్నారు. ఇప్ప‌టికీ చంద్ర‌బాబు అమరావతి రైతులను భ్రమలె పెట్టాలని చూస్తున్నారని, ద‌మ్ముంటే చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంతా రాజీనామా చేసి ఉపఎన్నిక‌లకు వెళ్ళాల‌ని రోజా స‌వాల్ విసిరారు. గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు చిత్తు చిత్తుగా ఓడించినా, చంద్ర‌బాబు ఇప్ప‌టికీ సిగ్గులేని రాజ‌కీయాలు చేస్తున్నార‌ని రోజా మండి ప‌డ్డారు.