KTR: అది ఏప్రిల్ ఫూల్ అయితే బాగుండు: కేటీఆర్

KTR: గత కొన్ని రోజుల నుండి నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే కేంద్రం నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర కూడా పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విషయం గురించి తాజాగా కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహా జోక్ అయితే బాగుండేదని అన్నాడు.

ఇక మరో ట్వీట్ లో ‘అచ్చే దిన్ దివస్’ ను ఏప్రిల్ ఫూల్ డే గా పోల్చి వెటకారంగా స్పందించాడు. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ తాను పోస్టింగ్స్ పెట్టిన ప్రతిసారి ఇబ్బంది పడేవారు ట్విట్టర్లో తన ను ఫాలో కావద్దని తెలిపాడు.