Manchu Vishnu: ఎన్టీఆర్ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచువిష్ణు…ఏమన్నారో తెలుసా?

Manchu Vishnu: మంచు విష్ణు త్వరలోనే కన్నప్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఇలా సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు ఈయన తనదైన శైలిలోని సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఏకంగా వీరి కుటుంబంలో జరుగుతున్న గొడవలు గురించి ప్రశ్నించారు ఏమడిగినా మాకు సమాధానం చెప్పే మంచి మనసున్న మీరు జనరేటర్ లో చెక్కర ఎదుకు పోసావన్న అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ జనరేటర్ లో చక్కెర పోస్తే మైలేజ్ వస్తుందని ఎక్కడో చదివాను అందుకే చక్కెర పోసాను అంటూ తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు.

ఇక చాలామంది అభిమానులు కనప్ప సినిమా గురించి ప్రశ్నలు అడిగారు. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు విష్ణు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ప్రభాస్ గురించి కూడా విష్ణును కొన్ని ప్రశ్నలు వేశారు. ఎన్టీఆర్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏమని చెబుతారు అంటూ ప్రశ్న వేయగా తారక్ బ్రిలియంట్ యాక్టర్ అంటూ విష్ణు సమాధానం చెప్పారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదట నిజమేనా అంటూ మరొక నేటిజన్ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు విష్ణు అవును తను రెమ్యూనరేషన్ తీసుకోలేదు అంటూ సమాధానం చెప్పారు. అయితే మోహన్ బాబుకు ప్రభాస్ మధ్య మంచి రిలేషన్ ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమాలో నటించారని తెలుస్తుంది మోహన్ బాబును సరదాగా ప్రభాస్ బావ అంటూ పిలుస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.