Katrina Second Innings In Tollywood : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వున్నప్పుడు రూపొందిన సినిమా ‘మల్లీశ్వరి’. త్రివిక్రమ్ అందించిన మాటలు ఈ సినిమా సక్సెస్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లాయనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ప్రముఖ మోడల్ అయిన కత్రినా కైఫ్ ఈ సినిమాతోనే హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. తొలి సినిమా మంచి విజయం అందుకోవడంతో పాటు, కత్రినా పేరు మార్మోగిపోయింది టాలీవుడ్లో.
అయితే, ఆ తర్వాత కత్రినాకి తెలుగులో ఆ స్థాయి హిట్ రాలేదనుకోండి. రెండు, మూడు సినిమాల తర్వాత బాలీవుడ్కి చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
మళ్లీ టాలీవుడ్ వైపు కన్నెత్తయినా చూడలేదు కత్రినా. తెలుగు సినిమాకి ప్యాన్ ఇండియా హోదా అందడంతో, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే శ్రద్ధా కపూర్, అలియా భట్ తదితరులు తెలుగులో సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత అలియాభట్, ఎన్టీయార్తో మరో ప్రాజెక్టులోనూ నటిస్తోంది కూడా.
ఇక ఇదే క్రమంలో మల్లీశ్వరి కత్రినా కైఫ్ చూపులు కూడా టాలీవుడ్పై పడ్డాయట. ఆమె ఆసక్తి తెలిసిన టాలీవుడ్ మేకర్లు ఆల్రెడీ కత్రినాతో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరిపారనీ తెలుస్తోంది.
ఆ సినిమానే త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా. అయితే, ఈ సినిమాలో కత్రినా ఫుల్ లెంగ్త్ రోల్ పోషించట్లేదట. ఓ స్పెషల్ సాంగ్తో పాటు, ఒకట్రెండు సన్నివేశాలు కూడా ఉంటాయట. (Katrina Second Innings In Tollywood)
ఆ కొద్దిపాటి నిడివికే కత్రినా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనీ అంటున్నారు. నిజంగానే అంత రెమ్యునరేషన్ ఇచ్చి మల్లీశ్వరిని టాలీవుడ్కి తీసుకొస్తారా.? లేక టాలీవుడ్ హీరోయిన్లతోనే కానిచ్చేస్తారా.? అనేది తెలియాల్సి వుంది.