20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని అవతారేమో అంటున్న ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు..

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గురించి అమెరికాలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈయన మంగళవారం రోజు ఆశా జడేజాను కలిశాడు.

ఈ సందర్భంగా ఆమె తన ట్విట్టర్ వేదికగా ఆయనతో దిగిన ఫోటోను పంచుకుంటూ.. ఆయన గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. రాబోయే 20 ఏళ్లలో మంత్రి కేటీఆర్ భారత దేశానికి ప్రధానమంత్రి అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నది. అంతే కాకుండా అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపింది.