బాసర విద్యార్థుల నిరసన పై స్పందించిన కేటీఆర్..

తాజాగా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని అంటూ రోడ్డుపై నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం గురించి బత్తిని తేజా గౌడ్ అనే ఒక యువకుడు కేటీఆర్ కు తెలిపాడు. దీంతో కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

అంతేకాకుండా విద్యలో నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని.. విద్యార్థులు ఎటువంటి విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు. ఇక ఈ విషయం గురించి వెంటనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. విద్యార్థుల సమస్యలపై ఇవాళ వీసీ తో సమావేశం అవుతున్నట్లు తెలిపారు.