వామ్మో ఇదెక్కడి టీ అండి బాబు.. కిలో టీ పొడి దాదాపు లక్ష నా..?

చాలామందికి ఉదయం లేవగానే ‘టీ’ తాగనిదే రోజు గడవదు. సాయంత్రం లేదా కాస్త అలసటగా ఉన్నా, నలుగురు వ్యక్తులు ఒక చోట కలసినా సరే కచ్చితంగా ఒక్క ‘టీ’ తాగాల్సిందే అనుకునేవారు చాలా మందే ఉంటారు. టీ అలవాటు ఉన్నవారికి ఒక టీ తాగితే చాలు వారు ఎటువంటి మూడ్ లో ఉన్నా సరే ఇట్టే మూడ్ సెట్ అవుతుందని నమ్మేవారు కూడా ఉంటారు.

ఎన్ని డ్రింక్స్ వచ్చిన కూడా ‘టీ ‘కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. మరి ఇంత స్పెషల్ అయిన టీ కి కనీసం ఒక లక్ష అయిన ధర లేకుంటే ఎలా అని అనుక్కున్నారేమో ఒక ప్రైవేట్ సంస్థ వాళ్లు. ఏకంగా ఒక కిలో టీ పొడిని దాదాపు లక్ష రూపాయలతో కొన్నారు.

‘టీ ‘లలో అస్సాం ‘టీ’ చాలా స్పెషల్.దాని టేస్ట్ కూడా అన్నింటికీ డిఫరెంట్ గా ఉంటుంది. అస్సోంలో పండే ప్రతీ ఒక్క ‘టీ’కి బయట మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఒకటి ఈ మనోహరి గోల్డ్ టీ పౌడర్. మనోహరి గోల్డ్ ” టీ ” పొడిని సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ కిలో టీ పౌడర్ ని ఏకంగా రూ. 99,999 కు వేలంలో సొంతం చేసుకున్నది. గత యేడాది ఇదే టీ పొడి రూ. 75,000 పలకగా అది ఈ యేడాది ఏకంగా లక్ష రూపాయల విలువ పలికింది.

ఈ తేయాకును కాచేటపుడు బంగారపు రంగు వస్తుంది కాబట్టి దీనికి మనోహరి గోల్డ్ టీ అనే పేరు వచ్చిందట. నిజంగా బంగారంకి పెట్టినట్టే రేటు పెట్టారు కదా, అంతే కాకుండా ఈ టీ లో చాలా ఆరోగ్య ప్రయోజనలు కూడా ఉంటాయట. అందుకే ఈ టీ వేలంలో ప్రపంచ రికార్డు పలికింది. ప్రపంచంలోనే బహిరంగ వేలంలో ఈ” టీ ” కి ఇంత ధర పలకడం ఇదే తొలిసారి.