KCR Self Goal : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తారా.? రాజ్యాంగాన్ని మార్చేసి, కొత్త రాజ్యాంగం రాయమంటారా.? రాజ్యంగం జోలికొస్తే ఖబడ్దార్.! దళిత మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యంగం కాబట్టి, దాన్ని మార్చమని కోరుతున్నారా.? అంటూ భారతీయ జనతా పార్టీ సహా పలు పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితిపై విరుచుకుపడుతున్నాయి.
వారెవ్వా.! రాజకీయం అంటే ఇదీ.! తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుతూ, ‘కొత్త రాజ్యాంగం’ అంశాన్ని లేవనెత్తారు. బీజేపీపై దుమ్మెత్తిపోశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడారు. వీటన్నిటికీ బీజేపీ నుంచి ఘాటైన సమాధానాలే వస్తున్నాయి.
రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్.. చాలా సున్నితమైన అంశాలు. దళిత ఆత్మగౌరవంగా ‘రాజ్యాంగం గురించీ, రాజ్యాంగ రూపకర్త గురించీ’ బలమైన భావజాలం నిండిపోయింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం గురించి మాట్లాడటం ద్వారా కేసీయార్ ఏం రాజకీయ లబ్ది పొందాలనుకున్నట్టు.?
రాజకీయ లబ్ది రాలేదు సరికదా, దళిత సమాజంలో కేసీయార్ పట్ల వ్యతిరేకత పెంచడానికి బీజేపీకి ఇదొక ఆయుధంగా మారుతోందన్నది నిర్వివాదాంశం. కేసీయార్ ఎక్కడా అంబేద్కర్ మీద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయలేదు. రాజ్యాంగాన్ని ఆయన అవమానపరచూ లేదు.
కానీ, మేటర్ ఇంకోలా కన్వే అయ్యింది మరి.!
