వామ్మో.. పెళ్లికి సమయం అడిగితే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడా.. పాపం ఆ యువతి..!

సాధారణంగా ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులు వారి పెళ్లి విషయాన్ని తెలియజేసి ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆత్మహత్యలకు పాల్పడడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ ఓ యువకుడు మాత్రం పెళ్లికి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినందుకు ఆ యువతిపై పగపట్టి ఆమెను పెట్రోల్ పోసి దారుణంగా చంపిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం కేరళలోని ఈ ఘటన సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

కేరళలోని కోజికోడ్‌లో జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోజికోడ్-పయ్యోలి నేషనల్ హైవేపై ఉన్న తిక్కూడి పంచాయతీ ఆఫీస్‌లో కృష్ణప్రియ అనే యువతి తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తుంది. ఈమెకు నంద కుమార్ అనే వ్యక్తితో గత నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. శుక్రవారం ఉదయం వీరిద్దరు బయట మాట్లాడుతూ వుండగా నందకుమార్ ఉన్నఫలంగా తనపై పెట్రోలు పోసి నిప్పంటించారు. అనంతరం తాను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వీరిద్దరు పూర్తి శరీర భాగాలు కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందకుమార్ రోజు కూలీగా పని చేసేవారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వీరి మధ్య పరిచయం ఉండటంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇదే విషయమై నందకుమార్ కృష్ణప్రియ తల్లిదండ్రులతో మాట్లాడారు. అందుకు ఆమె తల్లిదండ్రులు వారికి కొంత సమయం కావాలని చెప్పడంతో ఆ మాటకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి మరి ఈ సాగతీయడం ఎందుకు అంటూ కృష్ణప్రియతో గొడవ పడ్డారు. ఈ గొడవ కారణంగా ఆగ్రహం చెందిన నందకుమార్ ఏకంగా తన పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా చనిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం కేరళలో సంచలనంగా మారింది.