Sucide Note: సూసైడ్ లెటర్ రాసి మృతి చెందిన భర్త.. నా చావుకు కారణం నా భార్య..!

Sucide Note: సాధారణంగా పెళ్లయిన తర్వాత అమ్మాయికి అత్తవారింట్లో వరకట్న వేధింపులు లేదా అత్త ఆడపడుచుల వేధింపులు ఎక్కువ అవ్వడం వల్ల వారి మానసిక వేదనను భరించలేక కోడలు మృతిచెందిన ఘటనలు గురించి మనం వినే ఉంటాం. కానీ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య అత్త మామ బావ మరదలు వేధింపులను తట్టుకోలేక ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిచివేసింది. ఈ క్రమంలోనే సూసైడ్ లెటర్ రాసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి అందించిన వివరాల మేరకు…బడంగ్‌పేట్‌కు చెందిన శ్రీరాముల శ్రవణ్​కుమార్ (30), జనగామకు చెందిన రవళిని 2019 ఫిబ్రవరి 21వ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండు సంవత్సరాల కూతురు కూడా ఉంది. పెళ్లయినప్పటి నుంచి రవళి ఏదో ఒక విషయంలో తన భర్త శ్రవణ్ తో గొడవ పడుతూనే ఉండేది. ఈ క్రమంలోనే రవళి తన భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది.ఈ క్రమంలోనే శ్రవణ్ తన తల్లిదండ్రులను తీసుకెళ్లి రవళిని తన ఇంటికి రావాలని కోరగా కుటుంబ సభ్యులు వీరిపై గొడవకు దిగారు.

అనంతరం కొద్ది రోజులకు రవలి మెట్టినింటికి వచ్చింది. ఇలా కొద్ది రోజులపాటు మంచిగా ఉన్న రవలి తిరిగి తన తో గొడవ పెట్టుకుని 2021 వ సంవత్సరంలో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరోసారి శ్రవణ్ తన భార్యను తన ఇంటికి తీసుకురావడం కోసం వెళ్ళాడు. అయితే శ్రవణ్ అత్త మామ ఇద్దరు బావ మరదలు వారికి 20 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఇల్లును అమ్మాలని శ్రవణ్ భావించాడు. ఇల్లుని అమ్ముతున్న క్రమంలో రవళి నోటీసులు పంపింది. ఇలా అత్తింటివారి వేధింపులు భరించలేక శ్రవణ్ కుమార్ తన చావుకు కారణం తన అత్తమామలు తన భార్య, బావ మరదలు అని సూసైడ్ లెటర్ రాసి నీళ్ల ట్యాంకు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.