Online Gambling: కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్లైన్ గేమ్.. భార్య పిల్లలను చంపి ఆపై తాను!

Online Gambling: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ పూర్తిగా ఆ ఆటలకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు మందలిస్తే పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం ఇదే విషయంపై భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

పెరుంగుడి పెరియార్‌లోని ఓ అపార్టుమెంట్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న మణికంఠన్‌ అనే వ్యక్తి.. కోయంబత్తూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. అయితే గత రెండు నెలల నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఇలా ఇంట్లో ఉంటూ గేమ్స్ ఆడుతూ పూర్తిగా ఆటలకు బానిసగా మారాడు. ఈ విషయం గురించి తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి.

ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అధిక మొత్తంలో అప్పులు చేసిన మణికంఠన్ తో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ విషయం గురించి భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో ఆవేశంలో మణికంఠన్ తన ఇద్దరు పిల్లలు భార్యను చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి ఇంటి తలుపులు మూసి ఉండటానికి గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇంటి తలుపులు తెరిచి చూడగా మీరందరూ విగత జీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించి కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటనే దర్యాప్తు చేస్తున్నారు.