గ్రేటర్ ఫలితం : టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీమణి ఓటమి !

జీహెచ్ ఎంసి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, గతం కంటే చాలా సీట్లు తక్కువగా వస్తున్నాయి.

 

trs telugu rajyam

ఈ ఎన్నికల్లో బీజేపీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 40 సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుంది.

ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హబ్సిగూడ డివిజన్‌లో భార్య స్వప్న ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి చేతన చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో స్వప్న విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఓడిపోక తప్పలేదు. మరోవైపు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కంచుకోట లాంటి మోండా మార్కెట్లోనూ కాషాయ జెండా ఎగిరింది.

మోండా మార్కెట్ అంటే తలసాని రాజకీయ ప్రస్థానానికి పునాది. అక్కడి నుంచే పోటీ చేసి గెలిచిన ఆయన మెల్లగా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అలాంటి చోట బీజేపీ జెండా ఎగరేసింది. ఈ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల పుష్ప ఓటమి పాలయ్యారు.