జబర్దస్త్ నుండి బయటికి వస్తే డబుల్ రెమ్యూనరేషన్ తో పాటు పర్సనల్ గిఫ్టులు…?

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న టీవీ షోస్ లో జబర్దస్త్ కి ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గత కొంతకాలం క్రితం వరకు ఈ షో టాప్ రేటింగ్స్ తో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే కొన్ని రోజులుగా ఈ షో నుండి జడ్జెస్ తో పాటు పాపులర్ కమెడియన్లు కూడా వరుసగా బయటకు వెళ్లిపోవడంతో జబర్దస్త్ రేటింగ్స్ రోజురోజుకి దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే ఈ షో నుండి నాగబాబు, రోజాలతో పాటు సుధీర్, గెటప్ శ్రీను, ఆది వంటి స్టార్ కమెడియన్లు కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

ఇక తాజాగా జబర్దస్త్ అందాల యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ఇప్పుడు ఈ షో కి దూరమైతే జబర్దస్త్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. తాజాగా అనసూయ స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్, పార్టీ లేదా పుష్ప అనే షోస్ లో సందడి చేస్తోంది. అయితే అనసూయ ఇలా మా టీవీలో ప్రసారమవుతున్న షోస్ లో కనిపించటానికి కారణం.. మా టీవి వారు డబుల్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయ టమే అని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగబాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల నాగబాబు మొదట జబర్దస్త్ షో కి దూరమయ్యాడు. ఆ సమయంలో ఆయనతోపాటు కొంతమంది కమెడియన్లు కూడా జబర్దస్త్ నుండి బయటికి వచ్చారు. అయితే ప్రస్తుతం నాగబాబు మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ నుండి బయటకి వచ్చిన వారికి నాగబాబు మాటీవీలో ఆఫర్ ఇచ్చి డబుల్ రెమ్యూనరేషన్ ఇప్పించటమే కాకుండా పర్సనల్ గిఫ్ట్స్ ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మొత్తానికి మల్లెమాల వారితో ఉన్న మనస్పర్థల కారణంగా నాగబాబు ఇలా చేస్తున్నారని టాక్.