శంఖం ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఎంతో పవిత్రంగా దైవ సమానంగా భావిస్తాము. ఇలా పవిత్రంగా భావించే వాటిలో శంఖం ఒకటి. శంఖం ఇంట్లో ఉండటంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే శంఖం ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు పురాణాల ప్రకారం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఉద్భవించడం వల్ల శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శంఖం మన ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం మనపై ఉంటుందని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు. ఇకపోతే శంఖం మహావిష్ణువుకి ఆభరణంగా భావిస్తారు. అందుకే శంఖం మన ఇంట్లో ఉంటే మహా విష్ణువు కూడా మన ఇంట్లో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు.

నియంత్రిత శ్వాసతో శంఖం ఊదినపుడు ఓంకారం వినిపిస్తుంది. ఈ ఓంకార నాదం మనశ్శాంతిని కలిగిస్తుంది.వైకుంఠవాసి విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ శంఖాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఊదుతారు ఇలాంటి శంఖాన్ని దేవుని పీఠంపై ఉంచి పూజిస్తారు. అలాగే సంపదకు అధిపతి అయిన కుబేరుడి నివాసంగా శంఖాన్ని పరిగణిస్తారు కనుక శంఖం ఇంట్లో ఉండటం వల్ల కుబేరుడి అనుగ్రహం మనపై ఉండి సంపద అభివృద్ధి చెందుతుంది. ఎంతో పవిత్రమైన ఇలాంటి శంఖాన్ని పవిత్రంగా భావించి పూజించాలి తప్ప ఇష్టానుసారంగా పడేయకూడదు.