Corona: మళ్లీ సునామీలా ముంచుకొస్తున్న కోవిడ్ ఫోర్త్ వేవ్!

Corona: ఇప్పటికే ఎన్నో దేశాలను కరోనా వైరస్ ఓ రేంజ్ లో వణికించింది. ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఇప్పటికే మూడు దశలతో ముంచేసింది. ఇక గత కొన్ని నెలల నుంచి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లు పట్టగా మళ్లీ ఫోర్త్ వేవ్ తో ముందుకు వస్తుంది.

ఇప్పటికే భారత్ లో గత 24 గంటల్లో 975 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 949 కేసులు నమోదు కాగా 796 మంది కోలుకున్నట్లు తెలిసింది. ఇక దేశంలో మొత్తం 11,356 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. ముందురోజు తో పోల్చినప్పటికీ మరిన్ని కేసుల సంఖ్య పెరగటంతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పలుచోట్ల లాక్ డౌన్ విధించగా.. జూన్, జూలై నెలల్లో దీని తీవ్రత సునామీలా ఉంటుంది అని తెలుస్తుంది.