ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ఫ అస్వస్థతకు గురయ్యారు. దీంతో యశోద వెళ్ళిన కేసీఆర్కు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. యాంజియోగ్రామ్ రిపోర్ట్ నార్మల్గా వచ్చింది. రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవు డాక్టర్స్ తెలిపారు. ముందుజాగ్రత్తగా CT స్కాన్తోపాటు.. మరికొన్ని పరీక్షలు కూడా నిర్వహించారు. కేసీఆర్ కాస్త నీరసంగా ఉన్నారని ఫ్యామిలీ వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఎడమచేయి లాగుతున్నట్లు చెప్పడంతో.. జనరల్ చెకప్లో భాగంగా ప్రాథమిక టెస్టులు చేసినట్లు ఆయన తెలిపారు.