Madhu yashki: టీఆర్ఎస్ పై మండిపడ్డ చైర్మన్ మధుయాష్కీ!

Madhu yashki: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తాజాగా టిఆర్ఎస్ పై మండి పడ్డాడు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కు అడ్డాగా మారిందని.. ఏడేళ్ల టిఆర్ఎస్ పాలనలో విశ్వ నగరం విజయనగరంగా మారిందని అన్నాడు. ఇక కేటీఆర్ ని ఉద్దేశిస్తూ.. కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నావ్.. ఐఐటీ హైదరాబాద్ నీ హబ్ గా చేసింది కాంగ్రెస్ అని అన్నాడు. మీ హాయంలో డ్రగ్స్ కు క్యాపిటల్ సిటీ గా మారిందని అన్నాడు.

విద్యార్థులను మత్తుకు బానిస గా చేశారని, విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని మండిపడ్డాడు. అంతేకాకుండా ఆస్పత్రిలో రోగులను ఎలుకలు కొరుకుతుంటే సిగ్గు అనిపించడం లేదా అని తీవ్రంగా విమర్శించాడు. కేసీఆర్ కు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోతారని.. సామాన్య ప్రజల పరిస్థితులు చూసుకోవడానికి సహనం లేదు అన్నట్లుగా దారుణంగా వ్యాఖ్యలు చేశాడు.