బ్రేకింగ్ : తీవ్ర విషాదం..మహేష్ కోనేరు మృతిపై ఎన్టీఆర్ ఎమోషనల్

గత కొన్నాళ్ల కితమే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సీనియర్ మోస్ట్ పి ఆర్వో బి ఏ రాజు గారు కాలం చెల్లించడం ప్రతీ ఒక్కరినీ చాలా బాధకు గురి చేసింది. మరి ఇప్పుడు మరో వార్త చిత్ర పరిశ్రమను కలచివేస్తుంది. టాలీవుడ్ లో పలు ఆసక్తికర సినిమాలు చేస్తూ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పర్సనల్ పి ఆర్వో గా పని చేస్తున్న నిర్మాత మహేష్ ఎస్ కోనేరు మరణించారు. ఈరోజు ఉదయం వైజాగ్ లో సడెన్ హార్ట్ ఎటాక్ రావడం మూలాన ఆయన ఆకస్మికంగా మరణించడం ప్రతీ ఒక్కరినీ ఎంతో దిగ్బ్రాంతికి లోను చేసింది.

అయితే తనకి చాలా క్లోజ్ అయ్యినటువంటి మహేష్ మరణంపై ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు. తన మరణం షాక్ కి గురి చేసింది అని అసలు నమ్మలేకపోతున్నానని ఎలాంటి మాట కూడా రావడం లేదు అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.

వారి కుటుంబానికి కూడా తన ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాని తెలిపారు. అయితే మహేష్ కోనేరు తన బ్యానర్ నుంచి ‘118’ లేటెస్ట్ గా ‘తిమ్మరుసు’, ‘మిస్ ఇండియా’, తలపతి విజయ్ “మాస్టర్” సినిమాలను తెలుగులో ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సమయంలో ఇలా జరగడం నిజంగా విషాదకరం.