Ysrcp: జగన్ పాలనకు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా..సంబరాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు..?

Ysrcp: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన మొదలై నేటికి 1000 రోజులు పూర్తి అయ్యింది. ఇక ఈ సందర్భంగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సాగించిన సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే బయట ఎక్కడా సంబరాలు కనిపించక పోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా పార్టీ అభిమానులు నేతలు తమ దైన శైలిలో ఫోటోలను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం తన పాలన పూర్తి వెయ్యి రోజులు అయిన సందర్భంగా ఇటువంటి వేడుకలు చేసుకోలేదు.

ఎప్పటిలాగే రాష్ట్ర పర్యటనకు వచ్చి కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి పోలవరం పర్యటనకు వెళ్లారు. అనంతరం పునరావాస కాలనీలకు చెందిన ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు.సీఎం జగన్ ఈ విషయంపై పెద్దగా పట్టించుకోక పోయినప్పటికీ ఆ పార్టీ నేతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు.