శరీర బరువు సమస్యతో బాధపడుతున్నారా…. పరగడుపున ఇది తాగితే చాలు కిలోల కొద్ది బరువు తగ్గడం ఖాయం?

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది వారి ఆహార విషయంలో కూడా ఎన్నో మార్పులు చేసుకున్నారు.సరైన సమయానికి చేసుకొని తినే సమయం లేక ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్లను తినటం వల్ల తొందరగా శరీర బరువు పెరిగి ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు.ఇలా అతి చిన్న వయసులోనే అధిక శరీర బరువు పెరగటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే ఈ విధమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే బరువు తగ్గడమే ప్రధాన లక్ష్యం. అయితే బరువు తగ్గడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న బరువు తగ్గరు. ఇలాంటివారు పరుగడుపున ప్రతిరోజు ఈ పానీయం సేవిస్తే కిలోల కొద్దీ బరువు తగ్గుతారు. మరి ఆ పానీయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ప్రతిరోజు నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల బరువు తగ్గుతారనే విషయం మనకు తెలిసిందే అయితే నిమ్మరసంలో కన్నా నిమ్మ తొక్కలో అధికంగా ఉన్నటువంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు తొందరగా శరీర బరువును తగ్గించడానికి దోహదపడతాయి. అందుకే నాలుగు నిమ్మకాయలను శుభ్రంగా కడిగి వాటిని రెండు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకుని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవాలి. ఈ మిశ్రమం సుమారు 15 రోజుల పాటు చాలా తాజాగా ఉంటుంది.

ఇలా తయారుచేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని ఒక గ్లాస్ నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఈ నిమ్మకాయల మిశ్రమాన్ని కలుపుకొని తాగటం వల్ల తొందరగా శరీర బరువు తగ్గుతారు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయినటువంటి మలినాలను శుభ్రం చేయడంలో కూడా ఈ పానీయం ఎంతో దోహదపడుతుంది. అయితే ఇది చాలా చేదుగా ఉంటుంది. కనుక తాగడానికి కాస్త ఇబ్బంది పడుతున్న వారు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అయిన తాగవచ్చు. అయితే డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు తేనె వేసుకోకపోవడమే మంచిది. అయితే క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.