పిల్లలలో జ్ఞాపక శక్తి పెరగాలంటే ఆహారంలో ఇవి తప్పనిసరి?

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రజలు యాంత్రిక జీవనానికి బాగా అలవాటు పడ్డారు. ఉదయం లేచిన దగ్గరనుండి ఉరుకులు పరుగులు జీవితం పని ఒత్తిడి, అనారోగ్యమైన జీవన విధానం కారణంగా మెదడుపై ప్రభావం పడుతుంది.ఈ క్రమంలో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా జులై 22న వరల్డ్‌ బ్రెయిన్‌ డేను జరుపుకుంటున్నారు. ఈ బ్రైన్‌ డేను మొదటిసారిగా 2014లో నిర్వహించారు. జూలై 22 న మెదడుకి సంబందించిన వివిధ అవగాహన కార్యక్రమాలతో పాటు మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలో మెదడు పని తీరు కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగాలంటే మెదడు పదునుగా ఉండాలి. అందువల్ల పిల్లలలో మెదడు పని తీరు మెరుగుపరిచే కొన్ని ఆహార పదార్థాలను వారికి అందించాలి.

పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేయటానికి వారికి అందించాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

• పిల్లలకు ప్రతిరోజు పరికించిన ముద్దు తప్పనిసరిగా ఇవ్వాలి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల ప్రోటీన్స్ లభిస్తాయి. గుడ్లలో ప్రోటీన్స్ తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, కోలిన్, జింక్, లుటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. అందువల్ల ప్రతిరోజు పిల్లలకు ఉడికించిన గుడ్డును ఆహారంగా అందించాలి.

• డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బాదం పప్పు తినటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పులలో పిల్లలకు ఆహారంగా అందించడం వల్ల వారిలో మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు నానబెట్టిన బాదం పప్పులను మాత్రమే అందించాలి.

• ఓట్స్ ఒక ఆరోగ్యకరమైన ఆహార పదార్థం. ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగి వీటిని తినటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఓట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఇమిడి ఉంటాయి. పిల్లల్లో మెదడు చురుగ్గా పనిచేయటానికి అవసరమైన పోషకాలు ఓట్స్ లో ఉంటాయి. అందువల్ల ఓట్ మీల్ గంజిని తయారుచేసి పిల్లలకు ఆహారంగా అందించాలి.

• పిల్లల మెదడు పదును పెట్టటంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చేపలను ఒమేగా త్రీ పార్టీ యాసిడ్స్ ప్రధాన వనరులుగా పరిగణిస్తారు. అందువల్ల వారంలో రెండు సార్లు తప్పనిసరిగా పిల్లలకు చేపలను అందించడం వల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడి చురుగ్గా పనిచేస్తారు.