AP CM Ys Jagan : బిగ్ న్యూస్ : ఏపీలో టికెట్ ధరలపై సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్.!

AP CM Ys Jagan : గత కొన్ని నెలల నుంచి కూడా ఏపీలో టాలీవుడ్ సినిమాకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు నెలకొని కొనసాగుతూ వచ్చాయో చూస్తున్నాం. దీని వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ మరింత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ టికెట్ ధరలను ఎందుకు రెగ్యులైజ్ చెయ్యాలని ఇంత ఆసక్తి చూపిస్తుందో కానీ మొత్తం అధికార పార్టీ ఈ ఇష్యు ని ప్రిస్టేజియస్ గా తీసుకుంది.

ఓ సందర్భంలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ చేతిలోనే ఉంది అని నాదేమీ లేదు ఆయన ఏం చెప్తే నేను అది చెప్తున్నా అని అక్కడ నుంచి ఆదేశాలు తోనే ఇదంతా అని తెలిపాడు. మరి ఇప్పుడు తాజాగా స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నే ఈ టికెట్ ధరల అంశంపై మాట్లాడ్డం సంచలనం రేపుతోంది.

తాను పేద ప్రజలు కోసమే టికెట్ ధరలను తగ్గించానని దీనిపై కూడా విమర్శలు కొందరు చేస్తున్నారని, వినోదం పేద ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఈ ధరలు నిర్ణయించామని తెలిపారు.

అంతే కాకుండా ఈ విమర్శలు చేస్తున్న వారు అంతా కూడా పేద ప్రజలకు వ్యతిరేఖులు అని సెన్సేషనల్ కామెంట్స్ ఈరోజు చెయ్యగా మళ్ళీ ఇవి సినీ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. మరికొందరు అయితే ముఖ్యమంత్రి స్థాయి మాటలు ఇవి కాదు అని పెదవి విరుస్తున్నారు.