అల్లు అర్జున్.. ‘అలవైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ స్టార్ హీరోల్లో ఒకరైపోయారు. అప్పటివరకు యబో యావరేజ్ మార్కెట్ మీద నెట్టుకొస్తున్న ఆయన త్రివిక్రమ్ చేతిలో పడి వంద కోట్ల మార్క్ కొట్టేసి టాప్ హీరోల్లో ఒకరయ్యారు. ఆ తర్వాత వెంటనే ‘రంగస్థలం’ సినిమాతో టాప్ రేసులో ఉన్న సుకుమార్ ను లాక్ చేసి ఆయనతో ‘పుష్ప’ చేస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ సినిమాలో తన స్థాయిని పెంచుకోవాలనేది బన్నీ ప్లాన్. అయితే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో ఆయన తండ్రి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కష్టం చాలా ఉంది.
ఎప్పటికప్పుడు ట్రెండింగ్ దర్శకులను పట్టుకుని బన్నీ కోసం ప్రాజెక్ట్స్ సెట్ చేశారు ఆయన. ఈ తండ్రీకొడుకుల నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా లెవల్. అందుకే ప్రశాంత్ నీల్ మీద గురిపెట్టారు. ‘కెజిఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ హాట్ కేక్ అయ్యారు. ఆయనతో సినిమా చేయడానికి దేశంలోని అగ్ర నిర్మాతలు, స్టార్ హీరోలు రెడీగా ఉన్నారు. భారీ పోటీ కూడ ఉంది. ప్రశాంత్ నీల్ జాబితాలో ప్రభాస్ ఆ తర్వాత ఎన్టీఆర్ ఉన్నారు. ప్రజెంట్ ప్రభాస్ సినిమా చేస్తున్న ఆయన ఆ వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది.
అది పూర్తవగానే బన్నీ సినిమాను లాక్ చేయించారు అల్లు అరవింద్. ఈ ప్రాజెక్ట్ విషయమై గీతా ఆర్ట్స్ ఆఫీస్ నందు కథా చర్చలు కూడ మొదలయ్యాయట. 2022, 2023 మధ్యలో వీరి సినిమా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి కొడుకుని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టడానికి అరవింద్ బాగానే కష్టపడుతున్నారన్నమాట.