టీడీపీలోకి సినీ నటి రవళి, వయా మంత్రి రోజా.!

Ravali

సినీ నటి రవళి గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, ఆమె ఆ తర్వాత టీడీపీలో ఎప్పుడూ కనిపించలేదు. మళ్ళీ ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారట. ఈసారి సీరియస్ రాజకీయం చేసేందుకు ఆమె సమాయత్తమవుతున్నారట. ఎవరీ రవళి.? ఏమా కథ.? ‘పెళ్ళి సందడి’, ‘వినోదం’ తదితర సినిమాల్లో నటించిన రవళి, నటిగా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా రవళి, మంత్రి రోజాతో కలిసి కనిపించారు. అదీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కావడం గమనార్హం. రవళి కుటుంబ సభ్యులతో కలిసి రోజా కుటుంబ సభ్యులూ కలిసి ఫొటోకి పోజులిచ్చారు. ఈ క్రమంలో ఇరువురి మధ్యా రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

వైసీపీలోకి రవళిని రోజా ఆహ్వానించారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై ఇటు రోజాగానీ, అటు రవళిగానీ స్పందించలేదు. ఒకప్పుడు సినిమాల్లో నటిగా రవళి మంచి పేరు తెచ్చుకున్నా, ఇప్పుడామెను గుర్తించేవారు తక్కువే.

మరి, రవళిని వైసీపీలోకి రోజా ఆహ్వానించారన్న ప్రచారంలో నిజం ఎంత వుండొచ్చు.? అన్నదానిపై బిన్న వాదనలున్నాయి. సినీ నటులు.. అందునా నటీమణులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం నటీమణులకు ఒకింత కష్టమైన వ్యవహారమే.!

ఇటీవలే టీడీపీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.