అందరి ముందు రష్మిని చితకబాదేసిన ఆది.. కావాలనే ఇలా చేశాడా?

బుల్లితెర మీద చలామణి అవుతున్న లేడీ యాంకర్లలో రష్మి గౌతమ్ కూడా ఒక్కరు. మొదట నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మికి సినిమాల ద్వార సరైన గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో తర్వాత బుల్లితెర మీద యాంకర్ గా స్థానం సంపాదించుకుంది. బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. జబర్దస్త్ ద్వారా రష్మి యాంకర్ గా బాగా పాపులర్ అయింది. జబర్దస్త్ షోలో రష్మి తన గ్లామర్ తో పాటు యాంకరింగ్ తో కూడా బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం రష్మి ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతోంది.

ఇంతకాలం ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన రష్మీ గత కొంతకాలంగా శ్రీదేవి డ్రామా కంపెనీ సోలో కూడా యాంకర్ గా సందడి చేస్తోంది మొదట షో లో సుధీర్ యాంకర్ గా వ్యవహరించాడు. కానీ సుధీర్ ఈ షో నుండి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి రష్మి వచ్చింది. ఇక జబర్దస్త్ లో కనిపించకుండా పోయిన ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రం బాగా సందడి చేస్తున్నాడు. ఈ షోని ఆది, రాంప్రసాద్ మాత్రమే ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఆషాడం మాసం సందర్భంగా ఈ షోలో ఆషాడం అల్లుళ్ళు అని కొత్త కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది.

ఈ క్రమంలో ఆది అల్లుడిగా స్కిట్ చేశాడు. ఈ మేరకు రష్మి ఆది కళ్ళకు గంతలు కట్టి చేతికి కర్ర ఇచ్చి అక్కడున్న అత్త లను కొట్టమని చెబుతుంది. వెంటనే ఆది కర్ర తీసుకొని అత్త అంటూ రష్మిని చిటికబాదాడు. ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా కావాలని అందరి ముందు రష్మీ ని కొట్టినట్టు తెలుస్తొంది. తర్వాత ఆది అత్త లను పట్టుకునే క్రమంలో అటువైపుగా ఉన్న రామ్ ప్రసాద్ వద్దకు వెళ్ళాడు. అటు సైడ్ వెళ్లు అని చెప్పినా కూడా ఆది వినకుండా.. రాంప్రసాద్‌ను కొట్టేశాడు. అలా ఈ ఇద్దరూ ఒకరినొకరు కొట్టేసుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.