AP: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచేవారు చాలామంది ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా మీడియా విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి ఎన్నో చానల్స్ ఉన్నాయి అలాగే ఎన్నో పత్రికలు కూడా ఉన్నాయి. అయితే ఇలా మీడియా మద్దతు విషయంలో ఓ ప్రైవేట్ సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడయ్యాయి ఈ సర్వేలో భాగంగా దాదాపు 80% మీడియా చంద్రబాబు నాయుడుకే మద్దతు తెలుపుతున్నట్లు వెళ్లడయింది.
ఇలా 80% మంది మీడియా వారు చంద్రబాబుకు మద్దతు తెలపడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఎప్పటినుంచో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా కొన్ని వార్త చానల్స్ వార్తాపత్రికలు పనిచేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడంతో ఎంతోమంది వెబ్సైట్లు నడుపుతున్నారు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఇలా వెబ్ సైట్స్ , యూట్యూబ్ చానల్స్ కూడా చంద్రబాబు నాయుడు కు మద్దతు తెలియజేయడం విశేషం.
ఇలా 80 శాతం మంది మీడియా వారు చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేయడం అంటే ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టం అవుతుంది.2024 ఎన్నికలకు ఏడాది ముందు వరకు రాష్ట్రంలో 550 వ్యక్తిగత చానెళ్లు ఉన్నాయని.. ఇప్పుడు ఆ సంఖ్య 2202 కు చేరిందని సర్వే వివరించింది. వీరిలో రాజకీయ విశ్లేషకులు.. ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, సామాజిక వుద్యమ కారులు ఇలా.. అనేక వర్గాలకు చెందిన వారు ఉన్నారు.
ఇలా వీరంతా కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పనిచేయడం విశేషం. ఇక వైసీపీని అనుసరించే చానెళ్లు కూడా ఉన్నాయని సర్వే పేర్కొంది. అయితే.. వీటి సంఖ్య చాలా వరకు తగ్గినట్టు తెలిపింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. 600 చానెళ్లు వైసీపీకి అనుబంధంగా పనిచేయగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 200లలోపునకు పడిపోయినట్లు సర్వే వెల్లడించింది. ఇలా మీడియా ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఉన్నంత క్రేజ్ వైసీపీకి లేదని స్పష్టం అవుతుంది.