పాఠాలు చెప్పిన ఉపాధ్యాయురాలి మీదే కత్తితో దాడి చేసిన విద్యార్థి …. ఎందుకో తెలుసా?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు చెడు వ్యసనాలకు బాగా అలవాటు పడుతున్నారు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడటమే కాకుండా చెడుసావాసాలు చేస్తూ తప్పుడు దారిలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న వయసులోనే యువకులు నేరాలు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు బంధుమిత్రులు మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు చేసినా కూడా వారి మీద కక్ష కట్టి దాడులకు దిగుతున్నారు. అయితే ఇటీవల ఒక విద్యార్థి ఏకంగా పాఠాలు నేర్పించిన టీచర్ మీదే కత్తితో దాడి చేసిన ఘటన కలకలంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్ళితే…పశ్చిమ ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నాడు ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం నాడు పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో బాధిత ఉపాధ్యాయుడు విద్యార్థులను పరీక్షించటానికి తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు సదరు విద్యార్థి ఉపాధ్యాయుడి పై కత్తి తో దాడి చేశాడు. ఇలా విద్యార్థి ఉపాధ్యాయుడు మీద దాడి చేయడంతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఇతర ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయగా గాయపడిన ఉపాధ్యాయుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి దర్యాప్తు చేసి ఈ దారుణానికి పాల్పడిన విద్యార్థి ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విద్యార్థిని విచారణ చేయగా గతంలో యూనిఫామ్ సరిగా ధరించకపోవడం వల్ల బాధిత ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మందలించాడని. ఆ కోపం వల్ల విద్యార్థి ఉపాధ్యాయుడి మీద కత్తితో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉపాధ్యాయుడు మందలించాడన్న కోపంతోనే విద్యార్థి కక్ష పెంచుకొని ఇలా కత్తితో దాడి చేయటం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు విద్యార్థి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.