Tiger Prabhakaran: టైగర్ ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడా.. తమిళ జనాల్లో హాట్ టాపిక్?

శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాజ్యం కోసం ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన ఎల్టీటీఈ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. వేలుపిళ్లై ప్రభాకరన్ (టైగర్) నేతృత్వంలో నడిచిన ఈ ఉద్యమం, శ్రీలంక చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘట్టం. 2009 మే 18న శ్రీలంక సైన్యం ఆయనను హతమార్చినట్లు అధికారిక ప్రకటన చేసింది. అప్పట్నుంచి ఆయన పేరు పూర్తిగా మరుగున పడింది. అయితే తాజాగా తమిళనాట మరోసారి ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులో ఎల్టీటీఈ అనుకూల పార్టీలకు ఎప్పుడూ ప్రభాకరన్ అంటే ప్రత్యేకమైన మమకారం ఉంటుంది. ఆయన చనిపోలేదనే వాదనలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. తాజాగా కొన్ని వర్గాలు మే నెలలో ప్రభాకరన్ తన అనుచరుడు పొట్టు అమ్మన్‌తో కలిసి ప్రజల ముందుకు రాబోతున్నారని చెబుతున్నాయి. ఇది తమిళనాడులో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్తలు పాకడంతో ఈ అంశంపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా స్పందించడం ప్రారంభించారు.

తమిళనాడులోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎల్టీటీఈకు అనుకూలంగా ఉన్న నెట్‌వర్క్‌ల వల్ల ప్రభాకరన్ ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడని కొందరు భావిస్తున్నారు. శ్రీలంక సైన్యం 2009లో ప్రభాకరన్ చనిపోయాడని ప్రకటించినప్పటికీ, ఆయన మృతదేహానికి సంబంధించి పూర్తి స్పష్టత అప్పట్లో రాలేదని అప్పటి నుంచే కొందరు అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఈ అంశం తమిళ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి, ప్రభాకరన్ చనిపోయాడా, బ్రతికే ఉన్నాడా అన్నది స్పష్టత రానీ ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ తమిళనాట తాజా వైరల్ వార్తలు మరోసారి ప్రజల్లో ఉత్కంఠ పెంచాయి. మే నెలలో ప్రభాకరన్ నిజంగా బయటకు వస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.

ధనుష్‌ Vs నయనతార || Analyst Dasari Vignan EXPOSED Nayanthara Vs Dhanush Controversy || Telugu Rajyam