తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తారక్ ఫ్యామిలీ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు సినిమా జీవితాన్ని బ్యాలెన్స్ గా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్ల భాగంలో బిజీగా ఉన్నాడు.

మరోవైపు తమ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తన తల్లి శాలిని, తన భార్య ప్రణతి, తన ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో పాటు తదితరులు ఉన్నారు. ఇక శ్రీవారి దర్శనం తర్వాత ఈ కుటుంబం మీడియా కంట్లో పడింది.