Shahid Kapoor : బన్నీతో సినిమా చేయాలనీ ఉందన్న బాలీవుడ్ హీరో.. మనసులోని మాటచెప్పిన జెర్సీ హీరో…!

Shahid Kapoor:ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది.మన హీరోలు కూడా బాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు.అక్కడి బాక్సఆఫీస్ వద్ద మన వాళ్ళు కలెక్షన్లు క్రియేట్ చేస్తున్నారు. ఇక రాజమౌళి మన తెలుగు సినిమా సత్తా ను ప్రపంచానికి తెలియచేసారు. ఇపుడు రాజమౌళి తో సినిమా చేయడానికి ఈ భాష కు సంబందించిన నటులు ఐనా సిద్ధంగా వుంటారు. మన తెలుగు హీరోల సినిమాలను ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంటారు. బాలీవుడ్ హీరోలు మన హీరోలను ఫాలో అవ్వటం ఇష్టపడే స్థాయికి మన వాళ్ళు ఏదిగారు.

ఇక మన హీరోలతో అక్కడి హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రేమ పెరుగుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది.ఇప్పటికే ఆయన హీరోగా వరుసగా తెలుగు చిత్రాలను రీమేక్ చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేసిన షాహిద్ ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కలిసి హీరో షాహిద్ కపూర్ మరియు హీరోయిన్ మీడియా ముందుకు వచ్చారు.

జెర్సీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన షాహిద్ కపూర్ ను తెలుగు లో ఏ హీరో అంటే అభిమానం.. ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని భావిస్తున్నారు అంటూ ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగించింది. అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి సంబంధించిన శ్రీవల్లి స్టెప్ ను కూడా ఈయన చేశాడు.ఇలా టాలీవుడ్ పై వాళ్ళ అభిమానాన్ని క్రేజ్ ను తెలియచేస్తున్నారు.ఇదే నిజం ఇయ్యి వీరి కాంబినేషన్ తెర మీద కనిపిస్తే అభిమానులకు పండగే.