పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్’ అంటున్నారు, ‘దే కాల్ హిమ్ ఓజీ’ అంటున్నారు.. ‘ఓజీ’ అనే టైటిల్ కూడా ప్రచారంలో వుంది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో సినిమా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు.
కాగా, ఈ ‘ఓజీ’ కోసం వాయిస్ ఓవర్ అవసరం కానుందనీ, దర్శకుడు సుజీత్ ఈ విషయమై ప్రభాస్ని సంప్రదించాడనేది హాటెస్ట్ ఖబర్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా ‘ఓకే’ చెప్పినట్లు తెలుస్తోంది.
సోసల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య జరిగే ‘పెంట’ సంగతెలా వున్నా, హీరోలు మాత్రం సఖ్యంగానే వుంటున్నారు. గతంలో ‘జల్సా’ సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.