భయపడుతున్న పవన్ కళ్యాణ్ నిర్మాతలు.!

నిజమే.! ఔను, ఇప్పుడిది నిజమే.! జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్లో భయాలు మొదలయ్యాయ్. ‘బ్రో’ ఒక్కటీ ఓ కొలిక్కి వచ్చింది. ‘ఓజీ’ మధ్యలో వుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలైనట్టే మొదలై.. ఆగింది. ‘హరిహర వీరమల్లు’ పరిస్థితేంటో తెలియదు.

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ‘వారాహి విజయ యాత్ర’కు పరిమితమైపోయారు పవన్ కళ్యాణ్. దాంతో, దర్శకుడు హరీష్ శంకర్.. అయోమయంలో పడిపోయాడు. ఆయనకే పెద్ద సమస్య.

నిర్మాణ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు చిన్న బ్రేక్ అయినా ఇచ్చి, పూర్తి చేయాల్సిన సినిమాలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘ఓజీ’ ఒక్కటే అతి కష్టమ్మీద పూర్తయ్యే అవకాశం వుందట. అంటే, ‘బ్రో’, ‘ఓజీ’తో సరిపెట్టుకోవాల్సిందేనేమో.! మరి, మిగతా నిర్మాతలో.!