సింహం సింగిల్ పై పవన్ కౌంటర్ వైరల్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే ఇపుడు తెలుగు స్టేట్స్ లో గట్టిగా వినిపిస్తుంది. కాగా ఇప్పుడు పవన్ సినిమాలు సహా రాజకీయాల్లో కూడా బిజీగా ఉండగా ఇప్పుడు షూటింగ్ జరుగుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” కి బ్రేక్ ఇచ్చి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుని కలిసేందుకు హుటాహుటిన వెళ్ళాడు.

అయితే పవన్ ఇలా వెళ్లడంతో న్యూస్ బయటకి రావడం పలు ఫోటోలు హీరో బాలకృష్ణతో కూడా బయటకి వచ్చాయి. కాగా ఇదిలా ఉండగా పవన్ బయటకి వచ్చి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టగా అందులో తనకి పాలిటిక్స్ లో బాగా ఎదురైన ఓ ప్రశ్నకి సమాధానం అందించడం వైరల్ గా మారింది.

పవన్ సింగిల్ గా పోటీ చేయలేడు అని వై ఎస్ జగన్ మాత్రమే సింహం సింగిల్ గా వచ్చినట్టుగా వస్తాడు అన్ని పలు విమర్శలు పాడేవి అయితే ఈ ప్రశ్నని ఓ విలేఖరి పవన్ ని అడగగా మేము సింహాలం పులులం కాదు మనుషులం వాళ్ళని సింగిల్ గా వస్తే రమ్మనండి అని కౌంటర్ అటాక్ ఇచ్చారు.

దీనితో చాలా రోజులు నుంచి వైరల్ అవుతున్న విమర్శకి పవన్ స్పందించినట్టు అయ్యింది. ఇక ఈ మీటింగ్ అనంతం మళ్ళీ పవన్ హైదరాబాద్ వచ్చి ఉస్తాద్ భాగస్ట్ సింగ్ షూట్ ని రీస్టార్ట్ చేయనున్నారని టాక్. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా 40 శాతం కంప్లీట్ అయ్యిందట.