వైఎస్ జగన్‌ను కించపరిచేలా స్కిట్.. ఒక్క వెంట్రుక కూడా పీకలేరు అంటూ నాగబాబు పంచ్!!

Nagababu Comments On Bomma Adirindi satirical Skit On YS Jagan

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అక్కడ జరిగే ట్రోలింగ్, నెగెటివిటీ ఇలా ప్రతీ ఒక్కటీ తెలుసు. ఏ కామెంట్లకు ఎలా స్పందించాలో తెలుసు. ఆదివారం రాత్రి ప్రారంభించిన బొమ్మ అదిరింది షో దుమ్ములేపుతోంది. మొదటి ఎపిసోడ్‌తోనే రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కించపరిచేలా, ఆయన మ్యానరిజాన్ని వెక్కిరిస్తూ స్కిట్ చేశారు.

Nagababu Comments On Bomma Adirindi satirical Skit On YS Jagan
Nagababu Comments On Bomma Adirindi satirical Skit On YS Jagan

గల్లీబాయ్స్ టీంలో రియాజ్ జగన్‌లా నడుస్తూ, చేతులు ఊపుతూ స్కిట్ చేస్తూ ఉంటే నాగబాబు, శ్రీముఖి పడి పడి నవ్వారు. ఈ ఘటనతో జగన్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. షో నిర్వాహకులపై, నాగబాబు, శ్రీముఖి, రియాజ్‌లపై ఓ రేంజ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. అభిమానుల ఆగ్రహాన్ని తట్టుకోలేకు సద్దాం, రియాజ్, హరి అందరూ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు వీడియోలు రిలీజ్ చేస్తూ క్షమాపణలు చెప్పారు.

వారంతా ఎంత క్షమాపణలు చెప్పినా జగన్ అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు. మెగా బ్రదర్ నాగబాబుపైనా విరుచుకపడుతున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్ అటు జగన్ అభిమానులు వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే ఈ సమయంలో నాగబాబు మాత్రం పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. సింహాసనంపై కుక్కను కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. బొమ్మ అదిరింది అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఏమీ పీకలేరు అంటూ సెటైర్ వేశాడు. అయితే ఇలా ఇరు వైపుల వారు సెటైర్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మరి దీనికి ముగింపు ఎక్కడ, ఎప్పుడు లభిస్తుందో చూడాలి.