స‌ముద్ర గ‌ర్భంలో సాహ‌సాలు చేస్తున్న కాజల్ అగర్వాల్.. క‌ళ్ళార్ప‌కుండా చూస్తున్న ఫ్యాన్స్

kajal aggarwal stunning pics shakes social media

క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజల్ అగర్వాల్ హ‌నీమూన్‌లో భాగంగా మాల్దీవుల‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. భూత‌ల స్వ‌ర్గంలా ఉన్న మాల్దీవుల‌లో కాజ‌ల్ త‌న భ‌ర్త‌తో క‌లిసి చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. అక్క‌డ ప్ర‌కృతిని త‌నివితీరా ఆస్వాదిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. ఇటీవ‌ల అండ‌ర్ వాట‌ర్‌లో బెడ్ వేసుకొని దానిపై కూర్చున్న నూత‌న దంప‌తులు ఏకాంతంగా చూస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్‌గా మారాయి.

kajal aggarwal stunning pics shakes social media
kajal aggarwal stunning pics shakes social media

తాజాగా కాజ‌ల్ దంప‌తులు స‌ముద్ర గ‌ర్భంలో సాహ‌సాలు చేస్తున్నారు.ముఖానికి ఆక్సీజ‌న్ మాస్క్‌లు ధ‌రించి స్కూబా డైవ్ చేస్తూ స‌ముద్రంలో ఇద్ద‌రు హాయిగా విహ‌రిస్తున్నారు. ఆ అద్భుత దృశ్యం కెమెరా కంటికి చిక్క‌గా, వాటిని కాజ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫ్యాన్స్‌కు థ్రిల్ క‌లిగించింది. ఇన్నాళ్ళు అమాయ‌కురాలిలా క‌నిపించిన కాజ‌ల్ ఇలాంటి సాహ‌సాలు చేయ‌డాన్ని ఎవ‌రు న‌మ్మ‌లేక‌పోతున్నారు

kajal aggarwal stunning pics shakes social media
kajal aggarwal stunning pics shakes social media

కాజ‌ల్ త‌న ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ చేసిన ఫొటోల‌కి చార్బెల్ టాడ్రోస్ చెప్పిన మాట‌ల‌ని కామెంట్ గా పెట్టింది. విశ్వం ఒక సముద్రం, దానిపై మనం తరంగాలు. కొందరు సర్ఫ్ చేయాలని నిర్ణయించుకుంటే, మరికొందరు డైవ్ చేయడానికి సాహసించారు అని తెలిపింది. ఏద‌మైన ఈ హ‌నీమూన్ చేప‌లు నీలిరంగులో మెరిసే సముద్రాన్ని చ‌క్క‌గా ఆస్వాదిస్తున్నారు. అక్టోబ‌ర్ 30న పెళ్లి పీట‌లెక్కిన కాజ‌ల్, గౌత‌మ్ దంపతులు వారం క్రితం మాల్దీవుల‌కి వెళ్లారు. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులని త‌నివీ తీరా ఆస్వాదిస్తున్నారు.