Sudigali Sudheer: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కమెడియన్ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన సుధీర్ ప్రస్తుతం ఒక యాంకర్ గా, యాక్టర్ గా కమెడియన్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి నాటి హీరో రోహిత్ గెస్ట్ గా వచ్చారు. రోహిత్ 16టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించాడు.ఆ తర్వాత సినిమాలకు దూరమైన రోహిత్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ బుల్లి తెర మీదకు తీసుకు వచ్చింది. ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో రోహిత్ కనిపించబోతున్నాడు. ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో రోహిత్ సుడిగాలి సుధీర్ మీద పంచులు వేసి ఒక ఆట ఆడుకున్నాడు. రోహిత్ ఎంట్రీ తోనే “ఎంటి సార్ ఆ ఫేస్ లో గ్లో ఏంటి అని అడగ్గా..దీన్నీ గ్లామర్ అంటారు నీకు పెద్దగా పరిచయం లేదనుకుంటా అని అంటాడు. అదేంటి సార్ మీ ఇన్స్పిరేషన్ తోనే నేను ఇలా ఉన్నాను అని సుదీర్ అనగా డైరెక్టర్ గారు ఇది కట్ చేయండి తర్వాత నాకు ప్రాబ్లం అవుతుంది” అని పంచ్ చేస్తాడు.
చాలా కాలం తర్వాత బుల్లితెర మీద రోహిత్ ని ఇలా చూడటంతో ప్రేక్షకులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రోహిత్ నటించిన సినిమాలను తలుచుకుంటూ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది అంటూ యూట్యూబ్ లో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
