వైరల్ : పవన్ పై గద్దర్ చిట్ట చివరి మాటలు బయటకి 

గత కొన్ని రోజులు కితమే తెలంగాణ గడ్డ ముద్దు బిడ్డ ప్రముఖ విప్లవ గళ గాయకుడూ దివంగత గద్దర్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. దీనితో తెలంగాణాకి చెందిన అనేకమంది ప్రముఖులు అలాగే ప్రజలు కూడా కన్నీటి పర్యంతం అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటికీ ఆ విషాద ఛాయలు అలా అలుముకొని ఉండగా..

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా తాను కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది అందరిలో చర్చగా మారింది. పవన్ కి గద్దర్ గారు అంటే ఇంత ఇష్టమా? ఇద్దరి మధ్య కన్నీళ్లు పెట్టుకునే స్థాయి బంధం ఉందా అని చాలా మందికి ఇపుడే తెలిసింది.

అయితే గద్దర్ కి చికిత్స జరుగుతున్న సమయంలోనే పవన్ హాస్పిటల్ కి వెళ్లి తనని పరామర్శించిన సంగతి తెలిసిందే. మరి ఆ సమయంలో పవన్ కోసం గద్దర్ మాట్లాడిన చిట్ట చివరి మాటలు ఇపుడు సినీ వర్గాల్లో పొలిటికల్ గా కూడా వైరల్ గా మారాయి. పవన్ జనసేన పార్టీ వారు ఓ వీడియో రిలీజ్ చేసి తెలిపారు.

మరి ఇందులో గద్దర్ మాట్లాడుతూ తమ్ముడూ పవన్ రాజకీయం అనేది పద్మవ్యూహం లాంటిది అందులో తెగించి ముందుకూ వెళ్ళాలి అలానే తెలివిగా వెనకడుగు కూడా వేయాలి. రాజకీయం అనేది ఓ గొప్ప కార్యం. తమ్ముడూ పవన్ మనది యంగ్ ఇండియా. దేశంలో 60 శాతం మంది యువతే ఉన్నారు.

ఈ యువ తరానికి నాయకత్వం కావాలి, తమ్ముడూ పవన్ కాలం గొప్పది, కాలంతో కదలాలి కాలంతో నడవాలి, కాలం కి రంగు రుచి వాసనా లేదు రేపటి కాలం నీదే, నీ యువతరానిదే విజయం నీదే. వందనలతో నీ అన్నయ్య గద్దర్ ముద్దుల తమ్ముడా అంటూ ముగించారు. దీనితో పవన్ పై గద్దర్ చివరి మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.