ఆ ఇద్దరి హీరోలను టార్గెట్ చేసిన బండ్ల గణేష్

ఒకప్పుడు టాలీవుడ్ లో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ ఒక్కసారిగా ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి అందర్నీ షాక్ కి గురి చేసాడు. పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు.

అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్, త్వరలో సినిమా ప్రొడ్యూస్ చెయ్యడానికి రెడీ గా ఉన్నాడు. బండ్ల గణేష్ తరచూ తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సినిమా ఈవెంట్స్ లో బండ్ల అతి కి కొందరు నవ్వుకుంటారు, కొందరు తిట్టుకుంటారు. ఏ మాత్రం సందర్భం దొరికినా పవన్ కళ్యాణ్ పొగడకుండా ఉండలేదు బండ్ల గణేష్.

మొన్న ఆ మధ్య పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ సినిమా ‘చోర్ బజార్’ సినిమా ఈవెంట్ కి పూరి రాకపోవడంపై బండ్ల గణేష్ ఘాటు విమర్శలు చేసాడు. తాజాగా ఇద్దరు టాలీవుడ్ హీరో లను వాళ్ళ తప్పు ఏం లేకపోయినా బండ్ల గణేష్ టార్గెట్ చేసాడు.

పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ ఇద్దరు యంగ్ హీరోలను బండ్ల గణేష్ కించపరిచారు. వారిని సంస్కారం తెలియని వాళ్ళుగా చిత్రీకరించారు. ఓ వేడుకలో యంగ్ హీరోలు అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కూర్చున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు. వారిద్దరూ కూర్చొన్న ఫొటోలతో పాటు ఇతర ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ కూర్చున్న ఫోటోలు పోస్ట్ చేసిన బండ్ల గణేష్… ”సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర దయచేసి నేర్చుకోండి ఆచరించండి అది మన ధర్మం” అని కామెంట్ చేశాడు.

బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ఆ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకొని కూర్చొని ఉండగా… అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ కాలుపై కాలేసుకుని కూర్చున్నారు. నిజానికి వాళ్ళు కూర్చున్న విధానంలో ఎలాంటి తప్పులేదు. సాధారణంగా పెద్దవారు పక్కన లేనప్పుడు అలా కూర్చోవడంలో తప్పు లేదు. పవన్ ని ఎలివేట్ చేయడం కోసం లేని తప్పు వెతికి మిగతా  వాళ్ళను టార్గెట్ చెయ్యడం దారుణమని కొందరు అంటున్నారు.