జనసేనాని పవన్‌ కళ్యాణ్‌కు ఏ.ఎమ్‌ రత్నం శుభాకాంక్షలు!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘ఖుషి’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఏఎమ్‌ రత్నం.. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ప్రజా సేవయే ధ్యేయంగా సిద్దాంత పరమైన ఆశయాలతో, ధృఢసంకల్పంతో నిర్మించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకొని, పదకొండవ సంవత్సరంలోకి ప్రవేశించిన తరునాన జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ప్రజా సేవయే ధ్యేయంగా సిద్దాంతపరమైన ఆశయాలతో, ధృఢసంకల్పంతో నిర్మించిన జనసేన పార్టీ దశాబ్ద కాలం పూర్తి చేసుకుని, పదకొండవ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సేవ మార్గంలో ఆయన ప్రయాణం దిగ్విజయంగా ముందుకు సాగాలని, ప్రజలకు మేలు జరగాలని, ఆయన కోరిక నెరవేరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.

ఈ సందర్భంగా జనసైనికులకు, వీర మహిళలకు శుభాకాంక్షలు..” అని ఏఎం రత్నం తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఓ పిక్‌ని కూడా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఏ. ఎం రత్నం ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ దర్శకుడు. ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్‌ పూర్తయినట్లుగా తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో.. ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.