Allu Arjun: వరుణ్ తేజ్ కోసం ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్..!

Allu Arjun: వరుణ్ తేజ్ హీరోగా చాలాకాలం తర్వాత ఒక సినిమా వస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడని చెప్పుకోవాలి.ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి సాయి మంజ్రేకర్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నరేష్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా, సిద్దు ముద్ద ,అల్లు బాబి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులు వేగవంతం అయ్యాయి. విడుదల తేదీ కూడా ఖరారు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరగాలి అన్నది నిర్ణయించడం జరిగింది.

ఏప్రిల్ 2న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ను వైజాగ్ లో గ్రాండ్ గా జరుగుతున్నట్లు తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు అందులో, అయితే అదే పోస్టర్ లో ఈ కార్యక్రమానికి విచ్చేయనున్న ముఖ్య అతిథి ఎవరో కూడా ప్రకటించారు.కాగా “గని” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్ ” మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ “గని” చిత్రం విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.