పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్, వేరుశనగ, ఓట్స్, పాలు, కాయధాన్యాలు, గింజలు, చేపలు (సాల్మన్, ట్యూనా), ఆకుకూరలు (బచ్చలికూర, పాలకూర) వంటి ఆహారాలు పిల్లల మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి.
వేరుశనగలో మెగ్నీషియం, విటమిన్ ఇ, జింక్, థయామిన్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి. ఓట్స్ లో పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వంటి పోషకాలు ఉంటాయి. పిల్లల బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ అందించడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పాలలో క్యాల్షియం మరియు విటమిన్ బి లు ఉంటాయి, ఇది పిల్లల మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాయధాన్యాలలో ప్రోటీన్, విటమిన్ బి మరియు జింక్ అధికంగా ఉంటాయి.
గింజలలో ప్రోటీన్ మరియు జింక్ అధికంగా ఉంటాయి. చేపలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆకుకూరల్లో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఈ ఆహారాలను పిల్లల డైట్లో చేర్చడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపడి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మ రసం తీసుకుంటే జ్ఞాపక శక్తి, అభిజ్ఞా పనితీరును పెంచుతుందని పలు అధ్యనాలు చెబుతున్నాయి. ఎందుకంటే దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కివీ: కివీలో కూడా విటమిన్ సి, కే వంటివి ఉంటాయి. ఇవి బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి.
పాలు, పెరుగు, జున్నులో ప్రోటీన్, బీ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణజాలం, న్యూరోట్రాన్స్మిటర్లు, ఎంజైమ్ల అభివృద్ధికి అవసరమైనవి. ఇవన్నీ మెదడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఆహారాలలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన దంతాలు, ఎముకల అభివృద్ధికి అవసరం. పిల్లలలో కాల్షియం అవసరాలు వారి వయస్సును బట్టి మారుతూ ఉంటాయి అందుకే వారు కాల్షియం అధికంగా ఉండే భోజనం తీసుకోవాలి.