నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. భారీ వేతనంతో 3055 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 3055 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. నార్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ 4 ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మే నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. aiimsexams.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎయిమ్స్ మంగళగిరిలో 117 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎయిమ్స్ బీబీ నగర్ లో 150 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుందని తెలుస్తోంది. నర్సింగ్ కౌన్సిల్ లో రిజిష్టర్ కావడంతో పాటు కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజులో మినహాయింపు ఉండగా ఓబీసీ అభ్యర్థులకు 2400 రూపాయలు, జనరల్ అభ్యర్థులకు 3000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జూన్ నెల 3వ తేదీన జరగనుందని తెలుస్తోంది. అనుభవం ఉన్న ఉద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.