నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి.
మార్చి నెల 1వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంస్థ మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీలను సైతం భర్తీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా ఎన్టీపీసీ అడుగులు వేస్తుండటం నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుంది.