ఢిల్లీలోని నేషనల్ మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. డిప్యూటీ మేనేజర్ 1, అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్ లీగల్ & రికవరీ 2, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 1, అసిస్టెంట్ మేనేజర్ హెచ్.ఆర్.ఎం. అండ్ అడ్మిన్ 1, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 5 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
2025 సంవత్సరం జనవరి 31వ తేదీ నాటికి డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 32 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కు 27 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ కు 30 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హత, అనుభవం ఆధారంగా నెలకు 40 వేల రూపాయల నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 సంవత్సరం మే నెల 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖా్ళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు లేకపోవడం వల్ల ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.